మనఊరు మనచెట్టు: January 2022

Monday, January 31, 2022

పురాణాల్లో మొక్కల ప్రముఖ్యత

మొక్కలను నాటడమంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్తరాలకూ నిలువ నీడను, ఆరోగ్యాన్నీ ప్రసాదించటమే.ప్రసాదించటమే.పద్మ పురాణం  ప్రకారం మొక్కలను నాటించిన వారికి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందట. నేేరేడు మొక్క నాటడం స్త్రీ సంతానదాయకమని, దానిమ్మ ను నాటితే మంచి భార్య వస్తుందని, రావి చెట్టు రోగాన్ని నాశనం చేస్తుందని, మోదుగ విద్యా సంపత్తిని ఇస్తుందని అంటారు. వేప సూర్య ప్రీతికరం. మారేడు శంకర ప్రీతికరం. చింత సేవకుల సమృద్ధిని కలిగిస్తుంది. మంచి గంధం మొక్క ఐశ్వర్యం, పుణ్యాన్ని, సంపెంగ సౌభాగ్యాన్ని, కొబ్బరి భార్య సుఖాన్ని, ద్రాక్ష మంచి భార్యను ఇస్తుందంటారు. ప్రతి వ్యక్తీ తాను నాటిన మొక్కను తన సొంత బిడ్డలాగా పెంచగలిగితే ప్రకృతంతా పచ్చదనం పెరిగి పుణ్యం కలుగుతుంది.